అభివృద్ధిలో సిరిసిల్ల నంబర్‌వన్ : కేటీఆర్

ముస్తాబాద్ మండలం తెర్లుమద్దిలో రైతులకు మంత్రి కేటీఆర్ రైతుబీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో ఉందని తెలిపారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారు. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు లాంటి చట్టాలు తీసుకొచ్చామని వివరించారు. రూ.17వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. మిషన్ భగీరథతో దీపావళి నాటికి ఇంటింటికి మంచినీరు అందిస్తామని చెప్పారు. అభివృద్ధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉందని కేటీఆర్ వెల్లడించారు.

error: