గులాబీమయమైన హైదరాబాద్

ప్రగతి నివేదన సభ కోసం భారీ బ్యాడ్జీలు, జెండాలు, లాలీపాప్స్, హోర్డింగులు, అధినేత కటౌట్లతో సిటీ గులాబీవనంగా మారింది. ఎటు చూసినా హోర్డింగులు, బ్యానర్లు, జెండాలతో సిటీ అంతా కళకళలాడుతోంది. సంక్షేమం, అభివృద్ధిని మేళవించి తయారు చేసిన హోర్డింగులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు మైనంపల్లి హన్మంతరావు, ఎం.ఎస్‌.ప్రభాకర్‌, పార్టీ నేతలు దానం నాగేందర్‌, బండి రమేష్‌ నేతృత్వంలో ప్రగతి నివేదన డెకరేషన్ కమిటీ సిటీలోని ప్రతీ రోడ్డు, ప్రతీ కూడలి, ఫ్లైఓవర్లు, మెట్రో పిల్లర్లను గులాబీమయం చేసింది.

error: