టీడీపీ గెలుపుతో తెలంగాణకు నష్టం-కేసీఆర్

తాను తెలంగాణ ప్రజల ఏజెంటునని,రైతులు,పేదల ఏజెంటునని కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేసారు.తాను కాంగ్రెస్ ఏజెంటునని ప్రధాని మోదీ,తాను బీజేపీ ఏజెంటునని రాహుల్ గాంధీ అంటున్నారన్నా సీఎం,ఎవరికో ఏజెంటుగా ఉండాల్సిన కర్మ తనకేం పట్టలేదని చెప్పారు.పేగులు తెగేదాకా పోరాడి రాష్ట్రము సాధించామని,దానిని అభివృద్ధి చేయడానికి కష్టపడ్తున్నామని అన్నారు.ప్రజల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని,కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.కులవృత్తులను ఆదుకుంటామని చెప్పారు.అమెరికా వంటి దేశాలతో పోటీ పడే బలమైన జెనరేషన్ ను తాయారు చేస్తున్నామని చెప్పారు.అందుకే అన్ని వర్గాల వారికి రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టి,అక్కడ చదివే ఒక్కో విద్యార్ధి ఫై ఏటా 1.20 లక్షలు ఖర్చు పెడుతున్నామని వివరించారు.విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మంచి జెనరేషన్ రావాలి.అది రాష్ట్రానికి మంచిది.ఫ్యూచర్ తెలంగాణ జనరేషన్ ను అభివృద్ధి చేస్తున్నాం.అని సీఎం తెలిపారు.

error: