తెరాస ను ఎదుర్కునే దమ్ములేక అంతా ఒకటయ్యారు-హరీష్ రావు

ఏపీలో అడుగడుగునా మోసాలకు పాల్పడిన చంద్రబాబు ను అక్కడి ప్రజలు చిత్తు చిత్తు గా ఓడించేందుకు సిద్దమవ్వడం వల్లనే కాంగ్రెస్ ముసుగులో తెలంగాణకు వస్తున్నాడని హరీష్ రావు గారు అన్నారు.సోనియా గాంధీ ఇటలీ దయ్యం అన్న చంద్రబాబు కు ఇవాళ ఆమె దేవత ఎలా ఐయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.అధికారం కోసం అవకాశవాద రాజకీయ చేస్తున్న కాంగ్రెస్,టీడీపీ లను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.ఆదివారం గజ్వేల్ లో కార్మిక కార్మిక సంఘాలు,ముస్లింలు,మేర కులస్తులు పాల్గొన్నారు.ఈ ఎన్నికలు అభివృద్ధికి,అవకాశవాదానికి మధ్య జరుగుతున్నాయన్నారు.తెరాస ను ఎదుర్కునే దమ్ములేక కాంగ్రెస్,సిపిఐ,TJS,టీడీపీ నాయకులందరూ ఒక్కటైతున్నారని,వంద మంది కౌరవులు వచ్చిన గెలుపు మాత్రం పాండవులదేనని హరీష్ రావు స్పష్టం చేసారు.

error: