ఆర్టీసీ బకాయిలు పెండింగ్ లోనే …

ఆర్టీసీ ఎంప్లాయిస్​కు, వర్కర్లకు జీతాల బకాయిల కింద ఐదేండ్ల కింద బాండ్లు ఇచ్చారు. ఈ బాండ్ల మెచ్యూరిటీ గడువు ముగిసి రెండు నెలలైనా చేతికి పైసలు అందలేదు. ఒక్కో కార్మికుడికి  దాదాపు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు బాండ్ల మీద రావాల్సిఉంది. కరోనా కష్టకాలంలో ఈ పైసలు అక్కరకొస్తయని ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు డబ్బుల్లేవని మేనేజ్​మెంట్​ చేతులెత్తేసింది.  కార్పొరేషన్​లో యూనియన్లు రద్దు కావడంతో  గట్టిగా అడిగే వారు కూడా లేకుండా పోయారు.

తెలంగాణ ఏర్పడి.. టీఆర్​ఎస్​ కొత్తగా పవర్​లోకి వచ్చిన తర్వాత 2015లో ఆర్టీసీ కార్మికులకు 44 శాతం  జీతాలు పెంచింది. పెరిగిన జీతాలు 2013 ఏప్రిల్1​ నుంచి అమలు లోకి వస్తాయని సర్కారు ప్రకటించింది. కార్పొరేషన్​ దగ్గర అప్పుడు ఫండ్స్​ లేకపోవడంతో 2013 ఏప్రిల్​ నుంచి 2015 మే వరకు పెరిగిన జీతాల బకాయిలను బాండ్ల రూపంలో ఇచ్చింది. 8.5 శాతం వడ్డీతో ఐదేండ్ల తర్వాత చెల్లించేలా ఈ బాండ్లను జారీ చేసింది. రెండేళ్ల కాలానికి పెంచిన జీతాలకు సంబంధించి ఒక్కో కార్మికుడికి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు రావాల్సిఉంది. బాండ్ల గడువు ముగియగానే వారు డిపోల్లో ఆఫీసర్లను కలిసి అడిగితే  తమకేం తెలియదన్న రిప్లై వచ్చింది. పైఆఫీసర్లను అడిగితే ఇప్పట్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చునని చెప్తున్నారు. ఒక విధంగా మేనేజ్​మెంట్ ​బాండ్లను క్యాష్​ చేయడం సాధ్యం కాదన్న సిగ్నల్స్​ ఇచ్చింది.  కరోనాతో బస్సులు బందై డ్యూటీలు లేక, సరిగా జీతాలు రాక ఇబ్బందులు పడ్డ వర్కర్లు ఈ బాండ్ల మీద  పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఖర్చులకు, పిల్లల చదువులకు పనికొస్తాయనుకున్న వారికి నిరాశే మిగులుతోంది.  ఆఫీసర్లు పట్టించుకోక పోవడం, యూనియన్లు రద్దు కావడం, వాటి ప్లేస్​లో ఏర్పాటైన వెల్పేర్​ కమిటీలు ఉన్నాయోలేదో అన్నట్టుగా మారడంతో ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమైతలేదని  వర్కర్లు వాపోతున్నారు.

error: