ఇదేనా మానవత్వం , సమాధి ఐన మానవత్వం

ఏడేళ్లు కంటికి రెప్పలా పెంచిన బిడ్డ, ఆ పేద తండ్రి వైద్యం చేయించలేనంత పెద్ద సమస్యతో చనిపోయింది…మృతదేహాన్ని స్టెచ్చర్ పై తీసుకొచ్చి హాస్పిటల్ మెయిన్ ఎంట్రన్స్ లో మెట్ల వద్ద పెట్టారు..బిడ్డ శవాన్ని ఇంటికి తీసుకెల్దామంటే చిల్లిగవ్వ చేతిలో లేదు, హాస్పిటల్ లో అంబులెన్స్ లు వర్క్ చేయట్లేదన్నారు…దీనితో కంటికి కాలువల నీరు కారుతుండగా ఏడ్చుకుంటు దవాఖాన నుంచి ఆటో స్టాండ్ వరకు బిడ్డ శవాన్ని చేతులపై మోసుకొని వెళ్ళాడు…అక్కడ డ్రైవర్లను కాల్లవేళ్ళపడి బతిమిలాడి ఇంటికి తీసుకొని వెళ్ళాడు…కరీంనగర్ జిల్లా హాస్పిటల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది…పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన సంపత్ తన కూతురు కోమలత కొన్నాళ్లుగా లివర్ సమస్యతో బాధపడుతుంది…చిన్నారిని కొద్దిరోజుల క్రితం కరీంనగర్ ఆస్పత్రిలో చేర్పించారు…పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం చనిపోయింది. తన కూతురు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అతని చేతిలో చిల్లిగవ్వ లేదు…అంబులెన్స్ కోసం అడిగితే పనిచేయడం లేదన్నారు…

error: