ఉత్సవాల కోసం భారీ బందోబస్తు

ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వినాయక ఉత్సవాలు నిర్వహించాలని భాగ్యనగర్ వినాయక ఉత్సవ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవ కమిటీలతో కమిషనర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఘటనలకు అవకాశం ఇవ్వొద్దని కమిషనర్ స్పష్టంగా సూచించారు. ఉత్సవాల కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తుగా కేసులు ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. ఈ సమావేశానికి నాలుగు జోన్లకు సంబంధించిన డీసీపీ, ఏసీపీ సీఐలు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

error: