ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ల స్వీకరణ

హైద‌రాబాద్ : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రంగారెడ్డి – హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్‌ను రిట‌ర్నింగ్ అధికారి ప్రియాంక అల విడుద‌ల చేశారు. జీహెచ్ఎంసీ ప్ర‌ధాన కార్యాల‌యంలో నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 24న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించనున్నారు. 26వ తేదీ వ‌ర‌కు ఉప‌సంహ‌ర‌ణ‌కు గడువు విధించారు. మార్చి 14న ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ స్థానంలో 5.60 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు. 616 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. డీఆర్సీ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం ఉండ‌నుంది.
వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్ బాధితుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు. నేటి నుంచి 5 రోజుల పాటు పోస్ట‌ల్ బ్యాలెట్ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు.

error: