ఎసిబి వలలో విద్యుత్ శాఖ డిఇ

గుత్తేదారు నుంచి బిల్లులు మంజూరు చేయడానికి యాబై వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సైదాబాద్ గ్రీన్ పార్కు కాలనీలోని తన ఇంట్లో లంచం తీసుకుంటుండగా ఎసిబికి చిక్కారు. దుర్గారావు భువనగిరి టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ డిఇగా పని చేస్తున్నాడు. దుర్గారావును అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని ఎసిబి అధికారులు తెలిపారు.

error: