కామ వాంఛ తీర్చాలన్న తండ్రి…కాటికి పంపిన కొడుకు

కామంతో కళ్లు మూసుకుపోయిన మగాళ్ళు మృగాళ్లు ల మారుతున్నారు.కన్నకూతురు కామ వాంఛ తీర్చాలని ఓ తండ్రి ఒత్తిడి చేయడంతో తన బాధను అన్నతో చెప్పుకొంది. దీంతో కన్నతండ్రిని కుమారుడు గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలములోని తిప్పాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు 50 సంవత్సరాల వయస్సు గల కాటిపల్లి మైలయ్య కాగా నిందితుడు ప్రశాంత్ పోలీస్ లో లొంగిపోయాడు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామంలో కన్నతండ్రి కాటిపల్లి మైలయ్య ను కొడుకు ప్రశాంత్ గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు.డిఎస్పి లక్ష్మీనారాయణ కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిప్పాపూర్ గ్రామానికి చెందిన మైలయ్య ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మూడో వార్డు సభ్యుడిగా గెలుపొందాడు.మైలయ్య కు భార్య, కొడుకు ప్రశాంత్ ,కుమార్తె ప్రవళికలు ఉన్నారు. మైలయ్య తాగుడుకు బానిసై భార్యను వేధించేవాడు.దీనికితోడు కన్న కూమార్తెను కామ వాంఛ తీర్చాలని ప్రతిరోజు వేధించేవాడు. బుధవారం రాత్రి ఫుల్ గా తాగి కుమార్తె ను కామ వాంఛ తీర్చాలని ఒత్తిడి చేశాడు. అడ్డుకున్న భార్యను చితకబాదాడు.ఆ సమయంలో కొడుకు ప్రశాంత్ అత్తగారు గ్రామమైన చిన్న మల్లారెడ్డికి వెళ్ళాడు. గురువారం ఉదయం ప్రవళిక రాత్రి జరిగిన విషయాన్ని ఫోన్లో తన అన్న ప్రశాంత్ కు వివరించింది.దీంతో వెంటనే తిప్పాపూర్ కు చేరుకున్న ప్రశాంత్ తండ్రి మైలయ్య ను నిలదీశాడు.దీంతో మైలయ్య ఇంట్లో నుంచి గొడ్డలి తీసుకువచ్చి ప్రశాంత్ పైకి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మైలయ్య చేతిలో ఉన్న గొడ్డలిని ప్రశాంత్ లాక్కొని మైలయ్య తలపై మోదాడు. దీంతో మైలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము అన్నారు

error: