కుక్క అడ్డురావడంతో కారు బోల్తా…మహిళ మృతి

సూర్యపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో కుక్క ను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో జ్యోతి(40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షేతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు… వీరు హైదరాబాద్ నుంచి మచిలీపట్నం కు వెళ్తుండగా ముకుందాపురం వద్ద ఘటన జరిగింది.. కృష్ణ జిల్లా మచిలీపట్నం సమీపంలోని కూచిపూడికి చెందినవారుగా పోలీసులు తెలిపారు… మృతురాలిని శవ పరీక్ష నిమ్మితం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…ప్రమాదంపై కేసు నమోదైనట్లు,దర్యాప్తు చేపడుతున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు…

error: