కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విదేశ పర్యటన

హైదరాబాద్‌: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 6,7, 8 తేదీల్లో ఆస్ర్టేలియాలో జరిగే ఉగ్రవాద ప్రభావిత దేశాల హోంమంత్రుల సదస్సులో పాల్గొననున్నారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి ఆయా దేశాల హోం మంత్రులతోనూ సమావేశమవుతారు. ఎస్‌బి, ఎన్‌ఐఏ, రా విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు ఆయనతోపాటు పర్యటించనున్నట్టు సమాచారం.

error: