కేటీఆర్ కు కేంద్రమంత్రి ఫోన్

హైదరాబాద్ లో స్కై వేల నిర్మాణం, రోడ్ల విస్తరణ, మౌళిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ భూముల బదలాయింపు విషయంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై కేంద్రమంత్రి స్పందించారు. రక్షణ శాఖ భూముల బదలాయింపుపై తమకు ఎలాంటి సంశయం లేదన్నారు. అధికారులు వివరాలన్నీ సేకరించి ఖరారు చేస్తారని ఆమె పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. బెంగళూరులో అభివృద్ధి పనులకు రక్షణ శాఖ భూములను ఇటీవల బదలాయించారు. అలాగే హైదరాబాద్ కు కూడా బదలాయించాలని కేటీఆర్ నిన్న ట్విట్టర్ లో ప్రస్తావించారు.

error: