కోహ్లి సరికొత్త చాలెంజ్‌

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha చాలెంజ్‌ను తీసుకొచ్చాడు.

ఈ చాలెంజ్‌కు సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘తుమ్‌ ముజే కూన్‌ దో తుమ్హే ఆజాదీ దూంగా’ (మీరు మీ రక్తాన్ని ఇవ్వండి..నేను స్వాతంత్ర్యం తెస్తాను) అనే సుభాష్‌ చంద్రబోస్‌ సూక్తిని చెబుతూ.. చిన్నప్పటి నుంచి ఈ సూక్తులు వింటున్నామని, స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి భారత సంప్రదాయన్ని చాటుదామని పిలుపునిచ్చాడు. పంద్రాగస్టు రోజు సంప్రదాయంగా సిద్దమై ఆ ఫొటోలను వేష్‌బుషా యాష్‌ ట్యాగ్‌తో అప్‌లోడ్‌ చేసి ఇతరులకు చాలెంజ్‌ విసరాలని పేర్కొన్నాడు.

error: