తెలంగాణలో కరోనా విజృంభణ

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 32,224 కు చేరింది. ఇవాళ ఒక్కరోజే ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే 1,013 మంది మంది కోలుకోగా.. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19,205కు చేరింది.

కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 9,076మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 762, రంగారెడ్డిలో 171 కేసులు నమోదయ్యాయి

error: