తొలి టెస్ట్ విజేత ఇంగ్లండ్

ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన తొలి టెస్ట్ లో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో  194 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విక్టరీతో ఇంగ్లండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. ఆరంగేట్ర టెస్ట్ లోనే అలరించిన ఇంగ్లండ్ యంగ్ స్టార్ సామ్ కుర్రాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. గ్రాండ్ విక్టరీతో ఇంగ్లండ్ వెయ్యో టెస్టును ఘనంగా ముగించగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో టీమిండియా మిగతా టెస్టులకు భారీగా ఆత్మవిశ్వాసం మూటగట్టుకుంది.

error: