నాలుగు మొక్కలు నాటాలి

ప్రతి ఉద్యోగి నాలుగు మొక్కలు నాటి తమ కుటుంబ సభ్యులతో కూడా నాటించాలని టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహ సముదాయంలో టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నాలుగవ విడత హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ సత్యనారాయణ, టీఎన్జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌, కార్యదర్శి రాజేందర్‌, పలువురు అధికారులు పాల్గొని మొక్కలు నాటారు.

error: