నేడు మైండ్ స్పేస్ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభం

హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ జంక్షన్లో రూ.౧౦౮.౫౯ కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను ఈ రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SK జోషి ప్రారంభించనున్నారు.దీంతో మైండ్ స్పేస్ జంక్షన్ పూర్తి స్థాయిలో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనుంది.వాహనాలు ఆపే అవసరం లేకుండా ఇరువైపులా నేరుగా ప్రయాణం సాగించవచ్చు.స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్యాకెజీ -4 లో భాగంగా హై టెక్ సిటీ ప్రాంతంలోని నాలుగు జంక్షన్లలో మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్స్ నిర్మాణం చేపట్టారు.ఇందులో బయోడైవర్సిటీ,మైండ్ స్పేస్ అయ్యప్ప సొసైటీ,రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్ ను సిగ్నల్ ఫ్రీ గా తీర్చిదిద్దుతున్నారు.

error: