పాలను వేడి చేస్తే బంతి తయారైంది…

బాన్సువాడ:  పాలను ఉడికిస్తే ప్లాస్టిక్‌ పదార్థంలా మారి నేలకేసి కొడితే బంతిలా ఎగరడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బుధవారం ఈ చోద్యం చోటుచేసుకుంది. స్థానిక రాజారాం దుబ్బలో నివాసం ఉండే అస్లామ్‌ ఓల్డ్‌బాన్సువాడలో గల పాల కేంద్రం నుంచి లీటర్‌ పాలు కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకెళ్లి వేడి చేయగా అవి పగిలిపోయాయి. అయితే పగిలిపోయిన పాలను వేడి చేసి అందులో చక్కెర కలుపుకొని తిందామనే ఉద్దేశంతో మరిగించగా ఆ పాలు కాస్త  ప్లాస్టిక్‌ ముద్దలా మారిపోయాయి.

error: