మహబూబాబాద్ జిల్లాలో కార్డెన్ సెర్చ్

మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా లోని జమాండ్లపల్లి, కంబాలపల్లి గ్రామాలలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఆదేశాలమేరకు డీఎస్పీలు నరేష్ కుమార్,జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి కలియతిరుగుతూ సోదాలు చేపట్టారు. సరైన అనుమతి పత్రాలు లేని 15 బైకులును, 2 గ్యాస్ సిలిండర్ లు , 1లక్ష రూపాయల విలువచేసే మద్యం వీటితో పాటు టపాసులు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి మాట్లాడుతూ… పట్టణానికి సమీపంలో ఉన్న గ్రామాలలో ఎక్కువగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు నిర్బంద తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అక్రమ వ్యాపారాలు, ఆసాంగిక కార్యక్రమాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమానం ఉన్నా వ్యక్తులు ఎవరైనా గ్రామాలలో కన్పించిన 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

error: