మహిళలతో అసభ్యనృత్యాలు

హైదరాబాద్ బేగంపేటలోని పబ్ లో మహిళలతో అసభ్యనృత్యాలు చేయిస్తూ,అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి 8 మంది మహిళలతోసహా 36 మందిని అరెస్ట్ చేశారు.

నిబంధనలకు విరుధ్దంగా బేగంపేట కంట్రీక్లబ్ లో నిర్వహిస్తున్నలిస్బన్ బార్ అండ్ రెస్టారెంట్, పబ్ లో నిబంధనలకు విరుధ్దంగా మహిళలతో అసభ్యంగా నృత్యాలు చేయిస్తున్నారని, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు, పంజాగుట్ట పోలీలుసు ఆదివారం సాయంత్రం దాడి చేశారు.దాడిలో 8 మంది మహిళలతో సహా 36 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8మంది మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ దాడిలో ప్రధాన నిర్వాహకుడు మురళితో పాటు బంటి, వేణుగోపాల్, నందీశ్వర్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.గతంలో కూడా ఈ పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరిగాయని, బార్‌ అనుమతులు రద్దుచేయమని ఎక్సైజ్‌ అధికారులకు, పబ్‌ అనుమతిని రద్దు చేయాలని కలెక్టర్‌కు లేఖ రాస్తున్నట్లు పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి వివరించారు.

error: