వైద్యుల నిర్లక్షానికి 7 ఏళ్ళ చిన్నారి మృతి

కళ్ళు చెమర్చే ఘటన.. చనిపోయిన 7 ఏళ్ల చిన్నారికి వైద్యం చేసి డబ్బులు దండుకున్న డాక్టర్లు

వర్షం పడుతుండగా పాప డెడ్ బాడీని ఒక నర్సు గొడుగు పట్టుకుని పాప దగ్గర నిలబడిన దృశ్యం కంట తడి పెట్టిస్తోంది.

వైద్యుల నిర్లక్షానికి 7 ఏళ్ళ చిన్నారి మృతి

కర్నూలు – ప్రకాశం జిల్లా చింతలపల్లె గ్రామానికి చెందిన పెద్దక్క, పెద్దరాజు దంపతుల కుమార్తె కావేరి అనే 3వ తరగతి చదువుతున్న చిన్నారిని గత నాలుగు రోజుల క్రితం కర్నూలు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.

వైద్యులు నాలుగు రోజులు చికిత్స పేరుతో 4 లక్షలు కాజేశారని తమ కూతురు కావేరి బతుకుతోందని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు కన్నీళ్లే మిగిలాయి.

ఆసుపత్రి యాజమాన్యం మాత్రం మీ కూతురు పరిస్థితి విషమించింది ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు.

చిన్నారి కావేరిని అంబులెన్స్ వద్దకు వెళ్లి చూసే సరికి తమ కూతురు మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు.

దీంతో తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి వైద్యులు పై మండిపడ్డారు.. తమ కూతురు కావేరిని ఆసుపత్రి వైద్యులే చంపేశారని గత రెండురోజుల క్రితమే మా కూతురు మృతి చెందిందని.. చనిపోయిన మా కూతురుకు ట్రీట్ మెంట్ చేశారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు పంచాయతి చేసి మృతి చెందిన కావేరి తల్లిదండ్రులకు 2 లక్షలు ఇవ్వాలంటూ బేరం కుదిర్చారు..

error: