సుందిళ్ల పనుల వేగం పెంచండి : హరీశ్ రావు

సుందిళ్ల బ్యారేజ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను, గుత్తేదార్లను మంత్రి  హరీశ్ రావు ఆదేశించారు. సుందిళ్ల బ్యారేజ్ లెఫ్ట్, రైట్ బండ్స్ పనుల్లో వేగం పెంచాలని చెప్పారు. వారం రోజుల్లో సేఫ్ లెవల్‌కు గైడ్ బండ్స్ పనులు పూర్తి చేయాలన్నారు. తద్వారా ఒక టీఎంసీ నీటిని నింపినా గైడ్ బండ్స్ పనులు పూర్తి చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. 74 గేట్లకు గానూ 41 గేట్లు బిగింపు పూర్తయ్యాయని ఇంజినీర్లు తెలిపారు. 3 గేట్ల బిగింపు పూర్తి కానున్నాయి. గేట్ల బిగింపు పనులు వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు. 200 మంది కూలీలను పెంచాలని గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. ఇంజినీర్లు, గుత్తేదార్లు సైట్ వద్ద రాత్రింబవళ్లు ఉండి పనుల్లో జాప్యం లేకుండా చూడాలని మంత్రి సూచించారు.

error: