సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దురాజ్ పల్లి గ్రామం వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది , బస్సు బోల్తా ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి , గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప సూర్యపేట జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు , తలకు తీవ్ర గాయాలైన నలుగురి ప్రయాణీకుల పరిస్తితి విషమంగా ఉండటంతో వారిని ప్రత్యేక ఆంబ్యులెన్స్ లో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు . నిన్న రాత్రి దివాకర్ ట్రావెల్స్ కు చెందిన ap 02 tc 7695 నంబరు గల బస్సు వైజాగ్ లో 49 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది , ఈ రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు సూర్యపేట సమీపంలోని దురాజ్ పల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది , దీంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి , సమాచారం అందుకున్న చివ్వెంల పోలీసులు , హైవే అథారిటీ రెస్క్యూ టీం సబ్యులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు . కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యపేట గ్రామీణ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు .

error: