IT దాడుల కలకలం

ఈ రోజు హైదరాబాద్ లోని పలు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఉదయం నుంచి రంగంలోకి దిగిన ఆ శాఖ అధికారులు నగరంలోని పలు ప్రముఖ కంపెనీలపై దృష్టి సారించారు.రవి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్,శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.అలాగే టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ ముగ్గురు కొడుకులు ప్రమోటర్స్ గా ఉన్నారని భావిస్తున్న DSA బిల్డర్స్ కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు.అయితే ప్రస్తుతం దేవేందర్ తనయులు ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా లేరని సమాచారం.

error: