పత్రాలు లేకుండా తరలిస్తున్న ఆవులను స్వాధీనం చేసుకున్న కరన్కోట్ పోలీసులు.
పోలీస్స్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న ఆవులను తోలుకెళ్తున్న వ్యక్తులను ఆపి క్రయవిక్రయాలకు సంబంధించిన పత్రాలు చూపించాలని కోరారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కరన్కోట్ పోలీస్స్టేషన్కు ఆవులను స్వాధీనం చేసుకున్నారు .
విషయం తెలుసుకున్న వీహెచ్పీ, బజరంగ్దళ్, బీజేపీ, ఏబీవీపీ నాయకులు కరన్కోట్ పోలీస్స్టేషన్కు పెద్దఎత్తున తరలివచ్చారు. బక్రీద్ సందర్భంగా ఆవులను విక్రయించడానికి తీసుకెళ్తున్నారని వారు ఆరోపించారు. ఇందుకు ఎస్ఐ స్పందిస్తూ ఆవులకు సంబంధించిన పూర్తి విచారణ చేపడతామన్నారు. అప్పటి వరకు ఆవులను పట్టణంలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు.