అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ వలసకూలీ సజీవ సమాధి అయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం లోని మల్కపేట రిజర్వాయర్ కట్ట పనుల్లో భాగంగా ధర్మారం వద్ద బండ్ 6 లో మంగళవారం తమిళనాడుకు చెందిన సెల్వరాజ్ (35) మీద మట్టి వేయడంతో సజీవ సమాధి అయ్యాడు. టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న సెల్వరాజ్ సోమవారం రాత్రి కట్ట మీద పడుకున్నాడు. అది గమనించని నైట్ షిఫ్ట్ టిప్పర్లు అతని మీద మట్టిని పోశాయి. మంగళవారం ఉదయం డోజర్తో చదును చేస్తుండగా మట్టికింద పడిఉన్న సెల్వరాజ్ను గుర్తించారు. స్థానికులు అతన్ని మట్టినుంచి బయటకు తీయగా అప్పటికే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సరైన రక్షణ చర్యలు, వసతులు కల్సించకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
Tags konaraopet officers sirisilla telangana tracter workers