అమితాబ్ కి దాదా సాహెబ్ పాల్కే అవార్డ్

దిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. సినీరంగంలో విశేషసేవలు అందించినందుకు గానూ అమితాబ్ కు అత్యున్నత పురస్కారం ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ట్వీట్ చేశారు. అమితాబ్ నటించిన ‘బద్లా’ చిత్రం ఈ ఏడాది విడుదలైన విషయం తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘సైరా’లో అమితాబ్ .. గోసాయి వెంకన్న పాత్రలో అలరించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

error: