బావ , మరిది – వరుస చోరీ

ఎంజాయ్ ​చేసేందుకు చోరీలు చేస్తున్న బావ బావమరిదిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద పదిన్నర తులాల బంగారం, 39 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి జోన్ డీసీపీ రక్షితమూర్తి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. మల్లాపూర్​లో ఉండే జంగలం చందన్ అలియాస్ రమేష్ ( 36 ), సిరిగిరి శంకరయ్య అలియాస్ శంకర్ ( 26 ) బావ బావమరుదులు. గతంలో చందన్ చోరీలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం డ్రైవర్​గా పని చేస్తున్నాడు. శాలరీ సరిపోకపోవడంతో ఎంజాయ్​ చేసేందుకు ప్లాన్​వేశాడు. తన బావమరిది శంకర్‌తో కలిసి తాళాలు వేసిన ఇండ్లలో చోరీలు చేస్తున్నారు. మేడిపల్లి హనుమాన్ కమాన్ వద్ద పోలీసులు చెకింగ్​చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని కేసులు ఫైల్​ చేశారు. మేడిపల్లి పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.

error: