శ్రీశైలం నీరు చంద్రబాబు జాగీరా -హరీష్ రావు

నాగర్ కర్నూల్ లో నిర్వహించిన ఎన్నికల రోడ్ షో లో భాగంగా ముఖ్య అతిథిగా హరీష్ రావు పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ, కృష్ణ నదిలో తెలంగాణకు దక్కాల్సిన వాటాకు అనుగుణంగా నీటిని వినియోగించాలనుకుంటే పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్ లకు కృష్ణ జలాలను నిలిపి వెయ్యాలని ఢిల్లీ కి లేఖ రాసిన చంద్రబాబు తో కాంగ్రెస్ నాయకులూ పొత్తు ఎందుకు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పాలని హరీష్ రావు అన్నారు.శ్రీశైలం నీరు చంద్ర బాబు జాగీరా అని ప్రశ్నించారు.మనకు రావాల్సిన నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ ఎత్తిపోతల మోటర్లను నడుపుతాం.పాలమూరు ప్రాజెక్టులను తడుపుతాం అని అన్నారు.తెలంగాణాలో వలస పోయిన వారిని రప్పిస్తుంటే,కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజకీయ వలస వాదులను భుజాన ఎత్తుకుని తెలంగాణ కు తీసుకొస్తున్నారని తీవ్ర స్థాయి లో మండిపడ్డారు.

error: