దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 4,42,86,256కు చేరుకున్నాయి. ఇందులో 4,36,54,064 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటిరకు 5,27,134 మంది మృతిచెందారు. మరో 1,05,058 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో మరో 36 మంది మరణించగా, 15,220 మంది కోలుకున్నారు.
ఇక కరోనా కేసులు భారీగా పడిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.57 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 208.57 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

error: