పులిని ఓడించి , భార్య పిల్లల్ని కాపాడి ….

బెంగళూరు: కట్టుకున్న భార్య, కడుపున పుట్టిన బిడ్డను కాపాడుకోవడానికి ఓ వ్యక్తి చిరుతతో పోరాడి దాన్ని హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. హసన్‌ జిల్లా హరిసెక్రె తాలూకాలోని బెండెకెరే ప్రాంతం గుండా భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న రాజగోపాల్‌ నాయక్‌పై ఒక చిరుతపులి దాడి చేసింది. దీంతో ముగ్గురూ ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ క్రమంలో రాజగోపాల్‌ భార్య, కూతురు మీదకు చిరుత లంఘించే ప్రయత్నం చేసింది. అప్రమత్తమైన రాజగోపాల్‌ పులిపై విరుచుకుపడ్డాడు. చిరుత చేస్తున్న గాయాలతో ఒకవైపు శరీరం నుంచి రక్తమోడుతున్నా పోరాటాన్ని మాత్రం ఆపలేదు. చివరకు ఎలాగోలా అతికష్టంమీద పులిని హతమార్చాడు. ఈక్రమంలో రాజగోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్ధానికులు ముగ్గురినీ దవాఖానకు తరలించారు.

error: