పెట్రోల్ ధరలు మళ్ళీ పెంపు

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు విక్రయ కంపెనీలు నేడు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బుధవారం 25 పైసల మేర పెరిగాయి. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.45కు చేరింది. డీజిల్‌ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు పెరిగింది. ఈ పెంపుతో జయపురలో పెట్రో, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.85, డీజిల్‌ రూ.83.87గా ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.34గా ఉన్నది. 2017, జూన్‌ 15 నుంచి చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే దేశంలో ఇంధన ధరల పెంపునకు కారణమని చమురు విక్రయ సంస్థలు వెల్లడించాయి. 2020 మే నుంచి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.14.79, డీజిల్‌ రూ.12.34 పెరిగింది.

పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో ఇలా ఉన్నాయి

చెన్నైలో- పెట్రోల్‌ రూ.87.18, డీజిల్‌ రూ.79.95

కోల్‌కతా- పెట్రోల్‌ రూ.85.92, డీజిల్‌ రూ.78.22

హైదరాబాద్‌- పెట్రోల్‌ రూ.87.85, డీజిల్‌ రూ.81.45

బెంగళూరు- పెట్రోల్‌రూ.87.30, డీజిల్‌ రూ.79.14

జైపూర్‌- పెట్రోల్‌ రూ.91.85, డీజిల్‌ రూ.83.87

error: