ప్రారంభం కానున్న మెట్రోరైలు సర్వీసులు

ఈ నెల(సెప్టెంబర్) ఏడు నుంచి మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అన్ లాక్ 4తో మెట్రో ట్రైన్స్ నడిపేందుకు రెడీ అయ్యారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు. ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి.

సర్వీసుల ప్రారంభానికి మెట్రో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వీసులు ప్రారంభమైతే కేవలం డిజిటిల్ టికెట్ మాత్రమే ఇవ్వనున్నారు. మెట్రో ట్రైన్ లో కరోనా నిబంధనలకు అనుగుణంగా పబ్లిక్ ను అనుమతించనున్నారు. పదేళ్లలోపు, 65 ఏళ్లపై బడిన వారికి నో ఎంట్రీ అని చెబుతున్నారు. ట్రైన్స్ దగ్గరకు చేరుకునేందుకు లిఫ్టులు బంద్ చేయనున్నారు. కేవలం మెట్లు, ఎస్కలేటర్లు వాడేందుకు అనుమతించనున్నారు అధికారులు.

error: