హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని,తాము సిద్ధంగా ఉన్నామని GHMC కమిషనర్ దాన కిశోర్ వెల్లడించారు.గ్రేటర్ లో 40,56,524 మంది ఓటర్లు ఉన్నారని తెలిపిన ఆయన,ఓటింగ్ శాతం పెంపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.మరో పక్క పోలింగ్ సమయంలో ఏదైనా బూత్ లోని ఈవీఎం లో సాంకేతిక సమస్య వస్తే వెంటనే కొత్త ఈవీఎం లు ఏర్పాటు చేస్తామన్నారు.
TS24 News