ఎన్నికల ప్రచారం ప్రారంభం !

హుస్నాబాద్‌లో నిర్వహించనున్న టిఆర్‌ఎస్ సభకు ఏర్పాట్లు మంత్రి హరీష్‌రావు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గతంలో కూడా ఇక్కడి నుంచే సిఎం కెసిఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంబించిన విషయాన్ని గుర్తు చేశారు. కెసిఆర్‌కు కలిసొచ్చిన ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొంగర్‌కలాన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభలో నాలుగున్నరేళ్ల ప్రగతిని ప్రజలకు నివేదించామన్నారు. అలాగే ప్రజా ఆశీర్వాద సభలతో ఐదేళ్ల మేనిఫెస్టోను వివరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

error: