ఒకే తరగతిలో నలుగురికి కరోనా

గోపాలపట్నం జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికలకు కరోనా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు.బాధిత విద్యార్థినులను హోమ్‌ క్వారైంటన్‌లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు.విశాఖలో కరోనా తగ్గుముఖం పట్టిన సమయంలో ఒక్కసారిగా పాఠశాల విద్యార్థినులకు కరోనా సోకడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.కొత్తగా 16 కోవిడ్‌ కేసులు : జిల్లాలో కోవిడ్‌ కేసులు శుక్రవారం కొత్తగా 16 నమోదయ్యాయి.12 మంది డిశ్ఛార్జ్‌ అయ్యారు.ఆస్పత్రుల్లో 98 మంది చికిత్సపొందుతుండగా, 60,073 మంది కోలుకున్నారు.కోవిడ్‌ కేసులు సంఖ్య 60,710కు చేరింది.

error: