కరోనా గుప్పిట్లో కర్ణాటక

కర్ణాటకలో గడిచిన 20 రోజులతో పోల్చితే కొవిడ్‌ కేసుల సంఖ్య రెట్టింపయ్యింది.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 833 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.వీరిలో బెంగళూరులోనే 526 మంది ఉన్నారు.దీంతో 9.58 లక్షల మంది కొవిడ్‌ బాధితులయ్యారు.545 మంది కోలుకోగా ఇప్పటి వరకు 9.37లక్షల మంది డిశ్చార్జ్‌ అయ్యారు.తాజాగా ఐదుగురితో కలిపి ఇంత వరకు 12,386 మంది కొవిడ్‌తో మృతి చెందారు.30 జిల్లాల్లో 8,114 మంది చికిత్స పొందుతున్నారు.కాగా శివమొగ్గ జిల్లాలో ఆఫ్రికా వైరస్‌ వెలుగుచూడగా తాజాగా బళ్లారిలోనూ ఆనవాళ్లు కనిపించాయి.దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి వైరస్‌ ప్రబలడంతో జిల్లా అంతా అప్రమత్తం చేశారు.

error: