చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం మామడుగు సమీపంలో రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సజీవదహనమయ్యారు. ఒకరు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూరు నుంచి పలమనేరు వెళ్తుండగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. వాహనంలో ఉన్న ఆరుగురిలో ఐదుగురు సజీవదహనం కాగా.. ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మృుతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదుపు తప్పి కారు చెట్టును ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

error: