జగన్ ఇంట విషాదం

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది .సీఎం జగన్ మోహన్ రెడ్డి మామ ప్రముఖ వైద్యుడు గంగి రెడ్డి మృతి చెందాడు .గత కొద్దీ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు .గంగిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి వాళ్ళ నాన్న .గంగి రెడ్డి పార్థివదేహాన్ని పులివెందులకు తరలిస్తున్నారు .అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జరనున్నాయి .కొద్దీ రోజుల నుండి గంగి రెడ్డి అనారోగ్య కారణాల వాళ్ళ హాస్పిటల్లో చేరారు .తిరుమల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి పదిరోజుల క్రితం తిరుపతి నుండి నేరుగా హైదరాబాద్ వెళ్లారు .అక్కడ మామ గంగిరెడ్డి ని పరామర్శించారు .కానీ ఇంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే కన్ను మూసారు .ఈసీ గంగిరెడ్డి ప్రముఖ వైద్యులు .పేదల డాక్టర్ గా మంచి గుర్తింపు ఉంది .2001 – 2005 లో పులివెందులలో ఎంపీపీ గా పనిచేసారు .2003 లో రబీ విత్తనాల కోసం పులివెందుల నుండి కడప కలెక్టరేట్ వరకు ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేసారు .ఇక గంగిరెడ్డి మృతితో జగన్ ఇంట విషాదం నెలకొంది .

error: