తెరాస వస్తే సంక్షేమం,కూటమి వస్తే సంక్షోభం

తెరాస వస్తే సంక్షేమం,కూటమి వస్తే సంక్షోభం.ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి.టిక్కెట్ల కోసం ఢిల్లీ,అమరావతి చుట్టూ తిరిగే నేతలు గెలిస్తే ఏం అభివృద్ధి చేస్తారు?తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు వద్ద టిక్కెట్లను అడుక్కోవడం మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదా! అని హరీష్ రావు ప్రశ్నించారు.మహాకూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణ లో పెత్తనమా చెలాయించాలని చూస్తున్నారన్నారు.కూటమికి ఓటేస్తే బాబు పాలనే ఉంటుందని చెప్పారు.శుక్రవారం సిద్దిపేటలో ముదిరాజ్,నీలకంఠసంఘం,గజ్వేల్ లో గౌడ సంఘం,చిందు కళాకారుల ఆత్మీయ సభల్లో తరవాత మెదక్ జిల్లా తూప్రాన్ లో నిర్వహించిన రోడ్ షో లో హరీష్ రావు మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ఇప్పటివరకు తెలంగాణ కు ఒరగబెట్టింది ఏమి లేదు.ఏడు మండలాలను ఏపీ లో కలిపి తెలంగాణ కు అన్యాయం చేసింది.కేంద్రంలో తెరాస నిర్ణయాత్మక పాత్ర పోషించేలా ప్రజలు తీర్పు ఇవ్వాలి అని కోరారు.

error: