దత్తాత్రేయ కారు పల్టీ , తృటిలో తప్పిన ప్రమాదం

 

చౌటుప్పల్ మండలం ఖైతాపురం వద్ద గవర్నర్ దత్తాత్రేయ కార్ అదుపుతప్పి పల్టీ కొట్టింది. అయితే ఆయనకు తృటిలో ప్రమాదం తప్పిపోయింది. కేవలం స్వల్ప గాయాలు గాయాలు కాకపోవడంతో యధావిధిగా నల్గొండ కి బయల్దేరి వెళ్లిపోయారు దత్తాత్రేయ. ఇవాళ నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు
హైదరాబాద్ నుండి నల్లగొండ కు బయలుదేరి వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది… ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు దూసుకు పోయింది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు… ప్రమాదానికి గురైన తన కారును పరిశీలించిన గవర్మర్ దత్తాత్రేయ మరో వాహనంలో నల్లగొండకు బయల్దేరి వెళ్లిపోయారు.

error: