దాతృత్వాన్ని చాటుకున్న మున్సిపల్ కౌన్సిలర్ ఆస్మా నసిర్

హుజుర్నగర్ పట్టణ కేంద్రంలోని 25 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అస్మా నసిర్ తమ సొంత ఖర్చులతో సీతారాం నగర్ లోని 500 కుటుంబాలకు మరియు వలస కూలీల నిత్యావసర కూరగాయలు మరియు మైనార్టీ లకు ఇప్తార్ సంబంధించిన పండ్లు,ఫలహారాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్,మున్సిపల్ కమిషనర్ లు మాట్లాడుతూ కరోనా కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మన బాగు కోసం డాక్టర్లు,పారిశుద్ధ్య కార్మికులు,పోలీసులు నిత్యం శ్రమిస్తున్నారని వారికి సహకరించి అందరూ బాధ్యత ఇల్లాల్లో ఉండి కరోనా వైరస్ ను కట్టడి చేయాలని లేకపోతే కరోనా మహమ్మారి గా మారుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ.అనిల్ రెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల.నాగేశ్వరరావు, నాయకులు సయ్యద్ రఫీ, సాదిక్, వెన్నం శ్రీను, పుష్ప, నాగమణి, విజయ, మొహమ్మద్ రహీం,వెంకన్న, రాము, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

error: