నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ లో గల 60 గజాలలో నివాసం ఉంటున్న బ్రహ్మం నాయక్ వృత్తి రీత్యా కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ ఏర్పడి బ్రహ్మం నాయక్ ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి గారితో కలిసి ఇంటిని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే గారు రూ.51 వేలు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు. ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, తగిన పరిహారం అందేవిధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు బాధితులకు భరోసానిచ్చారు

error: