ప్రియుడు మోసం చేశాడు అని ప్రియురాలు మృతి.

ప్రేమించిన ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది…
వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా రాజ్ పల్లి గ్రామానికి చెందిన స్రవంతి (19),కామారెడ్డి జిల్లా బేబీపెట్ మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన భాను ప్రకాష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని ఆమె కోరింది.
యువకుడి తల్లిదండ్రులు విషయం తెలిసి గురువారం యువతి ఇంటికి వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసేది లేదని చెప్పారు.
మనస్తాపం చెందిన యువతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది.
ప్రేమ పేరుతో మోసం చేయడంతో కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
ఈ మేరకు రూరల్ యస్సై.కృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
error: