భార్య మీద అనుమానం , కూతురి మృతి

వడోదర : భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి తన  ఐదేళ్ల కుమార్తెను గొంతుపిసికి హత్య చేసిన అమానుష ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. ఆనంద్‌ జిల్లా ముజ్‌కువా గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. భార్యా భర్తల మధ్య నిత్యం వివాహేతర సంబంధాలపై ఘర్షణ జరిగేదని, ఈ క్రమంలో వేరొకరితో కూతురు పుట్టిందని భార్య వెల్లడించడంతో నిందితుడు బాలికను పొట్టనపెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు.

నిందితుడు శైలేష్‌ పదియార్‌ కట్టెలు తీసుకురావాలని చెప్పి తనతో పాటు కుమార్తెను తీసుకువెళ్లి పంటపొలంలో గొంతుపిసికి హత్య చేశాడని వెల్లడించారు. ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చిన శైలేష్‌ గ్రామస్తులతో కలిసి బాలికను వెతికేందుకు వెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు ప్రశ్నించడంతో నిందితుడు బాలికను తానే హత్య చేశానని అంగీకరించాడు.

error: