మనుషులు ఇండ్లల్లో ఉంటే జంతువులు రోడ్లపై తిరుగుతున్నాయి-హరీష్ రావు

సిద్దిపేట : సిద్ధిపేట మార్కెట్ యార్డులో పని చేసే 500 మంది హామాలీలకు సుధా నారాయణ మూర్తి సహకారంతో నిత్యావసర సరుకుల కిట్స్ పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, హాస్య నటుడు శివారెడ్డి.

– కరోనా అనే కొత్త రోగం ఇవాళ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది.

– మనుషులు ఇండ్లలో ఉంటే జంతువులు రోడ్లపై ఆడుతున్నాయి.

– కరోనా రోగానికి మందు లేదు. మందు అంటే కేవలం ఎవరి ఇండ్లలో వారు ఉండడమే.

– సీఏం కేసీఆర్ ప్రజలను ఎక్కడి వారిని అక్కడే ఉండమని సూచిస్తున్నారు.

– మన దేశం, మన రాష్ట్రం ఇప్పటికే సేఫ్ జోన్ లోనే ఉన్నది.

– అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో శవాలు గుట్టల్లా పెరుగుతున్నాయి.

– కరోనాతో చనిపోయిన శవం దగ్గరకు కన్నవారు, కట్టుకున్న వారు పోలేని పరిస్థితి నెలకొంది.

– మనిషిని మనిషి తాకితేనే ఈ రోగం వస్తుంది.

– అవసరమైతే తప్ప బయటకు ఎవరు రావద్దు.

– కొద్దిరోజులు ఓపిక పడితే ఈ రోగం బాధ మనకు తప్పుతుంది.

– సింగపూర్ వంటి దేశం ఒక నెల రోజులు లాక్ డౌన్ పాటిస్తుందని, అలాంటి పరిస్థితి రావద్దు అంటే మనమంతా ఇంట్లోనే ఉండాలి.

– డిల్లీలోని మర్కజ్ మీటింగ్ పోయి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాం.

– ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి., కానీ బయట తిరిగి రోగాన్ని కొని తెచ్చుకోవద్దు.

– సిద్దిపేటలో ఒక్కరికీ కూడా కరోనా రాలేదు.

– కరోనాకు కులం, మతం, చిన్నా, పెద్ద తేడా లేదు. ఇది సెక్యులర్ వైరస్

– స్పెయిన్ దేశ రాణి కరోనాతో మృతి చెందింది.

– ప్రజలంతా సామాజిక దూరం పాటించి, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి.

error: