“ముంబై ఓఎన్‌జీసీ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం “

“ముంబై ఓఎన్‌జీసీ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం ” ముంబయిలోని ఓఎన్‌జీసీ గ్యాస్‌ ప్రాసెసింగ్‌ ప్లాంటులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. నవీ ముంబయిలోని ఉరాన్‌ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జీసీ ప్లాంటులో ఉదయం 7:00 గంటల సమయం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కొన్ని నిమిషాల్లోనే మంటలు భారీగా ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో పలువురు కార్మికులు ప్లాంటులో పనిచేస్తున్నారు. వీరిలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

error: