రాఫెల్ ఒప్పందంపై సుప్రీంలో పిటిషన్

భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయని, ఈ ఒప్పందంపై స్టే విధించాలని కోరుతూ లాయర్ ఎంఎల్ శర్మ సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అంగీకరించింది. వచ్చే వారం దీనిపై విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ ఒప్పందాన్ని మహా దోపిడీగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణిస్తూ కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు.

error: