శవమై కనబడిన యువతీ

తప్పిపోయిన యువతి శవమై కనిపించిన సంఘటన మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన కునుకుట్ల పావని ఈ నెల 9వ తేదీన సూర్యాపేటలో ఉంటున్న తన బంధువుల ఇంటి నుంచి తప్పిపోయింది.

కుటుంబ సభ్యులు సూర్యాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలో యువతి తిమ్మాపురం గ్రామ శివారులోని పత్తి చేనులో శవమై కనిపించింది.

ఘటనా స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ మోహన్‌కుమార్‌, నాగారం సీఐ శ్రీనివాసులు, అర్వపల్లి ఎస్సై మహేష్‌ పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

error: